రోబో సంచలన విజయం తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ మరో క్రేజీ మూవీకి రెడీ అయ్యాడు. రజినీ-కేఎస్.రవికుమార్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం రాణా. రజినీ త్రిబుల్ రోల్స్ చేయబోతున్న ఈ మూవీ మూడుభాషల్లో రాబోతోంది. రోబోలో ఐశ్వర్యరాయ్తో జత కట్టిన రజినీ ఈ కొత్తమూవీలో బాలీవుడ్బ్యూటీ దీపికాపదుకొనేతో రోమాన్స్ చేయబోతున్నాడు. సౌతిండియా సూపర్స్టార్ కొత్తమూవీ డీటైల్స్ మీకోసం..
రజినీకాంత్..
ఈ పేరే పవర్ఫుల్..
తెరమీద ఆయన కనిపిస్తే చాలు థియేటర్లు దద్దరిల్లుతాయి. ఆడియన్స్ కేరింతలు ఆకాశన్నంటుతాయి. ఇండియన్ ఫిల్మ్ స్టామినాను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లి విదేశాల్లోనూ తన సినిమా పట్ల క్రేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు రజనీ.
గత ఏడాది రిలీజైన రోబో.. రజనీకాంత్ స్టామినా ఏంటో మరోసారి ప్రపంచానికి చూపింది. రజనీ అద్భుతమైన యాక్టింగ్కు ప్రేక్షకులు జైజైలు కొట్టారు. హాలీవుడ్కు మన సినిమా రేంజ్ ఏంటో చూపించాడు రజినీ.రజినీ-శంకర్ కాంబినేషన్ వచ్చిన ఈ మూవీ సృష్టించిన సంచలనం అంత ఇంతా కాదు. ఆరు పదుల వయస్సులో కూడా చలాకీగా ఉంటూ... డాన్స్లు,
ఎమోషన్స్ బాగా పండించాడు రజినీ. రోబో కమర్షియల్గానూ రికార్డు సాధించింది. ఆఫిసియల్ లెక్కల ప్రకారం 132 కోట్ల బడ్జెట్ అయిన ఈ మూవీకి,
15కోట్లు మీడియా శాటిలైట్ రైట్స్ కలుపుకుని మొత్తం 179 కోట్ల కలెక్షన్లు సాధించుకుంది. రోబో సెన్సేషనల్
హిట్తో ఉత్సాహంగా ఉన్న
రజనీకాంత్..
తదుపరి
చిత్రం ఏంటనే ఉత్కంఠకు
తెరపడింది.
రజినీ
కొత్తమూవీకి రాణా టైటిల్
ఖరారు చేసినట్టు చెబుతున్నారు.
అయితే ఈ సూపర్స్టార్ ఈ కొత్తసినిమాను కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. రజినీ-కేఎస్.రవికుమార్ కాంబినేషన్లో గతంలో ముత్తు.. నరసింహా.. వంటి సూపర్హిట్స్ వచ్చాయి. ఈ కొత్తమూవీలో రజినీ స్టైల్ను మరింత అదరగొట్టేలా తెరకెక్కించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
రోబోలో ద్విపాత్రాభినయం చేసిన రజినీ రాణాలో త్రిపాత్రాభినయం చేస్తారని తమిళ సినీ వర్గాల సమాచారం. గతంలో రజనీ త్రిపాత్రాభినయం చేసిన ‘మూండ్రముగం’చిత్రం తమిళంలో భారీ హిట్ కొట్టింది. అలాగే ఈ కొత్తమూవీలో రజినీ సరసన హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ దీపికాపదుకొనేను ఓకే చేశారట. ప్రస్తుతం దీపికా హిందీ సినిమాలతో బిజీ బిజీగా ఉంది. అయితే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదని, కాల్షీట్స్ సర్ధుబాటు చేసుకుని నటించటానికి రెడీ అయిందట ఈ భామ.
రోబోలాగే ఈ రజినీ కొత్తమూవీని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించబోతున్నారు. రోబోకు సూపర్హిట్ మ్యూజిక్ అందించిన మ్యూజిక్ లేజండ్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందించనున్నాడు. రోబో ఛాయాగ్రహకుడు రత్నవేలు ఈ చిత్రానికి పనిచేస్తున్నాడు.
ఇక మూవీ కమెడీని బేస్ చేసుకుని ఎంటర్టయిన్మెంట్గా తెరకెక్కించబోతున్నారని సమాచారం.
రజినీ త్రిపాత్రాభినయం.. కేఎస్.రవికుమార్ డైరెక్షన్.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్.. దీపికపదుకొనే హీరోయిన్.. మూడు భాషల్లో చిత్రం.. ఇన్ని ఇంట్రస్టింగ్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు అప్పుడే ఊపందుకుంటున్నాయి.
No comments:
Post a Comment