తారల క్రికెట్కు రంగం సిద్ధమవుతోంది. టాలీవుడ్ టీమ్కు విక్టరీ వెంకటేష్ కెప్టెన్గా, మంచు విష్ణు ఓనర్గా వ్యవహరిస్తున్నారు. అందాల తారలు తాప్సీ, సమంత బ్రాండ్ అంబాసిడర్లుగా చేయబోతున్నారు.
ఐపీఎల్ తరహాలో మన సినీతారలంతా కలిసి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్లు ఆడబోతున్నారు. ఈ ఎస్సీఎల్ మ్యాచ్లకు ఏర్పాట్లు మొదలయ్యాయి. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషలకు చెందిన నాలుగు జట్ల మధ్య మ్యాచ్లు ఉంటాయి. ఇందుకు సంబంధించి జట్ల ఎంపిక కసరత్తు మొదలైంది. టాలీవుడ్ జట్టు కెప్టెన్గా విక్టరీ వెంకటేష్ వ్యవహరించబోతున్నాడు. అలాగే 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తరపున జట్టుని కొనుగోలు చేసిన మంచు విష్ణు మన జట్టుకి ఓనర్గా వ్యవహరించబోతున్నారు.
ఇక కోలీవుడ్ జట్టుకు సూర్య , కన్నడ జట్టుకు పునీత్ రాజ్కుమార్.. కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ జట్టుకు సల్మాన్ఖాన్ నాయకత్వం వహించడంతో పాటు, ఆ జట్టుకి ఓనర్ కూడా అతడే.
ఈ సీసీఎల్లో ఆడేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు రెడీ అయ్యారు. ఫిబ్రవరి 14లోపు జట్టు ఎంపిక పూర్తి చేస్తారు. అప్పుడే టీమ్ ఆవిష్కరణ కార్యక్రమం జరిపి మ్యాచ్ షెడ్యూల్ ప్రకటిస్తారు.
No comments:
Post a Comment