Friday, November 23, 2012

రజినీ త్రీడి మూవీ @ 12-12-12

సూపర్ స్టార్ రజినీకాంత్ సూపర్ హిట్ మూవీ ‘శివాజీ’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సారి ఆధునిక హంగులు అద్దుకుని త్రీడీ రూపంలో ప్రేక్షకులను కనువిందు చేయబోతోంది. ఈ చిత్రానికి త్రీడీ హంగులు అద్దారు. ఇటీవలే ఆ సాంకేతిక కార్యక్రమాలు ముగిశాయి. ఈ సినిమాను 12-12-12 అంటే డిసెంబర్ 12న రజినీ బర్త్ డే సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి డిసెంబర్ 12న ‘కొచ్చాడయన్’ సినిమా విడుదల చేయాలనుకున్నారు. షూటింగ్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో ‘శివాజీ త్రీడీ’ సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.



కడప స్థానం నాదే..!


వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూతురు, వైఎస్ఆర్ సీపీ ఆశాకిరణం షర్మిల ఎన్నికల్లో పోటీ చేసే విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. కడప ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి షర్మిల నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయమైన సమాచారం ప్రకారం.. రానున్న ఎన్నికల్లో జగన్‌ పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు.
అయితే, ఇదే సమయంలో జగన్‌ చిన్నాన్న వైఎస్ భాస్కరరెడ్డి తనయుడు అవినాష్‌రెడ్డి పేరు తెరపైకి వస్తోంది. అయితే, షర్మిల పాదయాత్ర ప్రారంభించే ముందు తాను కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని కుటుంబసభ్యులకు స్పష్టం చేశారని, ఆ మేరకు వారి నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో పాదయాత్ర ప్రారంభించారని సమాచారం. సొంత కుటుంబీకులే.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సొంత కుటుంబీకులే పార్లమెంటుకు వెళ్లాలని షర్మిల వాదించడంతో వారంతా అందుకు అంగీకరించారు.
అయితే.. చాలాకాలం క్రితం వరకూ ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న అవినాష్‌రెడ్డి ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా బద్వేలు నుంచి పాదయాత్ర ప్రారంభించాలని భావించారు. ఆ మేరకు ముందు ఒక తేదీ అనుకున్నప్పటికీ, బద్వేలు ఇంచార్జి గోవిందరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఈనెల 23న బద్వేలు మండలం కలసపాడు నుంచి పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు.







Tuesday, November 20, 2012

అత్యంత ఖరీదైన ఖైదీ.!

తాజాగా ఉరి తీసిన ముంబై దాడుల ఉగ్రవాది అజ్మల్ కసబ్ మన దేశంలోనే అత్యంత ఖరీదైన ఖైదీ. పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్ గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన కసబ్ భద్రతకు ఇప్పటివరకూ ఖర్చుపెట్టిన మొత్తం 60 కోట్లు పైనే అని ఓ అంచనా. కసబ్ రక్షణ కోసం నెలకు సుమారు 75 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఇకపై తమవల్ల కాదంటూ.. ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మొరపెట్టుకుంది. సైన్యంలో అత్యంత కీలకమైన విభాగానికి చెందిన నిపుణులైన మెరికల్లాంటి 250 మంది ఇండో-టిబెట్ బోర్డర్  సైనికులను కసబ్ భద్రత కోసం వినియోగించడంతో ఖర్చులు మరింత పెరిగిపోయాయని ప్రభుత్వం తెలిపింది. ఈ కేసులో తొలిసారిగా అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అధికారులు ఇక్కడకు వచ్చి వాంగ్మూలమిచ్చారు.

మహరాష్ర్ట 28 కోట్లు..!
కసబ్ రక్షణ కోసం ఇప్పటి వరకు 28 కోట్ల రూపాయలను ఖర్చుచేసినట్లు అర్జీలో తెలిపింది. ఆహారం, వైద్యం, భద్రతా సిబ్బంది కోసం భారీగా ఖర్చు పెట్టామని కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్. పాటిల్ తెలిపారు.

గదికి ఐదున్నర కోట్లు..!
కసబ్‌ ఇప్పటి వరకు ఉన్న ఆర్థర్ రోడ్డు జైల్లో.. ప్రత్యేక గదికి ప్రభుత్వం 5.24 కోట్ల రూపాయల్ని ఖర్చుచేసింది. నరహంతుకుడి తిండికి, వైద్య అవసరాలకు, మందులకు, భద్రతా కల్పనకు కోట్లరూపాయలను నీళ్లలా ఖర్చుపెట్టింది.



మహేష్ యాడ్స్ ఆదాయం ఎంత?

టాలీవుడ్ బిజినెస్ మెన్ మహేష్ బాబు దూకుడు కొనసాగుతూనే వుంది. వరుస సినిమాలతోనే కాదు.. కార్పోరేట్ యాడ్స్ లల్లోనూ దూసుకుపోతున్నాడు మహేష్. ఇటు సినిమాలతో పాటు అటు కమర్షియల్ యాడ్లలో.. దూసుకుపోతూ చేతి నిండా సంపాదిస్తున్నాడు. తాజాగా మహేష్ బ్రాండ్ ఖాతాలోకి ‘రాయల్ స్టాగ్’ కూడా చేరినట్టు తెలుస్తోంది. సౌత్ ఇండియాలో రాయల్ స్టాగ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ ని ఎంపిక చేసినట్లు సమచారం. ‘రాయల్ స్టాగ్’కి ప్రచార కర్తగా వ్యవహరించేందుకు గాను మహేష్ భారీ మొత్తాన్నే పారితోషికంగా తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

మహేష్ ఇప్పటికే.. ‘సౌత్ ఇండియా షాపింగ్ మాల్’, యూనివర్సెల్, నవరత్న హెయిర్ ఆయిల్, ధమ్స్అప్, వివెల్, ఐడియా, జోష్ అలూకాస్, ప్రోవోగ్, అమృతాంజన్, సంతూర్, మహీంద్రా వంటి పన్నెండు బిగ్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నాడు. మరి కొన్ని కంపెనీలు ప్రిన్స్ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆసక్తిచూపిస్తున్నాయి.




టాలీవుడ్‌కు ఆ సత్తా లేదా?

గోవాలో జరుగుతున్న ’43వ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇండియా నుంచి 18 సినిమాలు ఎంపికయ్యాయి. అందులో తెలుగు సినిమాలకు మరోసారి పరాభవం ఎదురైంది. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చోటు దక్కించుకోలేక పోయింది.

కొత్త ప్రయోగాలు చేయడంలో మన టాలీవుడ్ ఎప్పుడు వెనకబడి ఉంటుందని చెప్పవచ్చు. సామాజిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం కేవలం కమర్షియల్ గా మాత్రమే ఆలోచించి సినిమాలు తీస్తుండటమే అవార్డులకు దూరం చేస్తోందని అంటున్నారు. ఈ మధ్య సినిమాలకు కలెక్షన్లు రావాలనే ఉద్దేశంతో దర్శకనిర్మాతలు బూతు, వివాదాలనే నమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.





Monday, November 19, 2012

మహేష్ కొత్త సినిమా టైటిల్ ఏంటి?

స్టార్ హీరోల సినిమాలకు టైటిల్స్ పెట్టాలంటే అది పెద్ద ప్రయత్నమనే చెప్పాలి. అందులోనూ మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ఇమేజ్ వున్న హీరోలకైతే మరీనూ! పేరులో ఫోర్స్ వుండాలి… అతని ఇమేజ్ని హైలైట్ చేసేలా వుండాలి… అప్పుడే అభిమానులకి అది నచ్చుతుంది. అందుకే, అతని సినిమాలకు టైటిల్స్ పెట్టడానికి పెద్ద కసరత్తే చేస్తుంటారు. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న చిత్రానికి గత కొన్నాళ్ళుగా అదే ప్రయత్నం జరుగుతోంది. మొదట్లో ‘ఆచార్య’ అనుకున్నారు. ఇది మరీ సాప్ట్ గా వుందని వద్దనుకున్నారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెండు టైటిల్స్ పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిలో ‘తుంటరి’ ఒకటి. ఈ చిత్రానికి ‘తుంటరి’ అనే టైటిల్ పెట్టే యోచనలో నిర్మాతలు ఉన్నట్లు రెండు మూడు రోజులుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర తన ట్విట్టర్ స్పందించారు. ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌ ఇంకా ఫైనలైజ్ కాలేదని అనిల్ సుంకర వెల్లడించారు. త్వరలోనే టైటిల్ ఖరారు చేస్తామని….అధికారిక సమాచారం వెలువడే వరకు పుకార్లను నమ్మ వద్దని అనిల్ సుంకర మహేష్ బాబు అభిమానులకు పిలుపునిచ్చారు.



Sunday, November 18, 2012

జగన్ పార్టీలోకి యాంకర్ రాణి రుద్రమ

నంది అవార్డు గ్రహీత, ప్రముఖ న్యూస్ యాంకర్, తెలంగాణ వాది రాణిరుద్రమ వైఎస్ఆర్ సీపీలో చేరారు.  తెలంగాణ ప్రాంతానికి చెందిన రాణిరుద్రమ టీవీ9, ఏబీఎన్, సాక్షి, టీన్యూస్ చానళ్లలో యాంకర్ గా పని చేశారు. యాంకర్, న్యూస్ రీడర్ గా, ఎన్నో చర్చవేదికల్లో నాయకులను సూటిగా ప్రశ్నించినటువంటి రాణిరుద్రమ వైకాపాలో చేరాడం హాట్ టాపిక్ గా మారుతోంది. వరంగల్ జిల్లా నర్సంపెటకు చెందిన రాణిరుద్రమ టీ న్యూస్ చానల్ నుంచి ఇటీవలే వెళ్లి పోయినట్లు తెలుస్తుంది.



‘ఆమ్నెస్టీ’ ప్రకటించిన దుబాయ్

యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జా, రసల్‌కైమా, ఉమాన్‌కుమ, ఖుజెర్‌మా, అజ్మాన ప్రాంతాల్లో ఉపాధి వీసా గడువు ముగిసిన తర్వాత ఉపాధి పొందుతున్న కార్మికులకు అక్కడి ప్రభుత్వం ఊరట కలిగించింది. సందర్శక వీసాపై వెళ్లి దొంగచాటున (కల్లివెల్లి) అయి ఉపాధి పొందుతున్న కార్మికులకు డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 4 లోగా ఎలాంటి జరిమానాలు లేకుండా స్వదేశానికి వెళ్లేలా వీలు కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం తీర్మానించింది.

చేతిలో వీసాలు లేక స్వగ్రామాలకు వెళ్లలేక నరకయాతన పడుతున్న కార్మికులకు ఇది మంచి వార్తే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దుబాయ్‌లోని గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌ శర్మ సూచించారు. మన రాష్ట్రం నుంచి సుమారు 20 వేల మంది కార్మికులు వీసాలు లేకుండా యూఏఈలో ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లోని సుమారు 15 వేల మంది కార్మికులు వీసా లేకుండా ఉపాధి పొందుతున్నారని ఒక అంచనా.




తెరవెనుక 'బాగోతం' విడుదల!

హీరోయిన్ల అందాలను సినిమా స్కోప్ లో చూపించే రాఘవేంద్రరావు షూటింగ్ గ్యాప్ లో ఏం చేస్తాడు? మెగాస్టార్ చిరంజీవి కష్టపడి పైకొచ్చాడా లేదా ఏదైనా షార్ట్ కట్ తోటి ఎదిగాడా? రాత్రి పూట షూటింగ్ అయితే హీరో హీరోయిన్స్ కలిసి ఏంచేస్తారు? వీటన్నింటి జవాబులు చెప్పారు ప్రఖ్యాత నిర్మాత కాట్రగడ్డ మురారి. గతంలో ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారు. అదే విధంగా కొన్ని బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేశాయి. చాలా కాలం తర్వాత మురారి తాజాగా  ‘నవ్విపోదురు గాక అనే పుస్తకంతో సంచలనం సృష్టిస్తున్నారు. తాజాగా ఈ పుస్తకం సినీప్రముఖుల సమక్షంలో చెన్నైలో విడుదలైంది.

ప్రముఖ గాయని సుశీల ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పలువురు సినీ, సాహితీ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్పీ బాలు మాట్లాడుతూ.. మాట కరకుగా కన్పించినా నవనీతమైన మనస్సున్న వ్యక్తి మురారి అని కితాబిచ్చారు.




Saturday, November 3, 2012

అమెరికా ఎన్నికల సర్వే ఫలితాలు

అల్లకల్లోలం చేసిన శాండీ హరికేన్‌ పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధరణ స్థితికి చేరుకోవడంతో మళ్లీ అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి ఊపందుకుంటోంది. అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ప్రత్యర్థి మిట్‌ రోమ్ని ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. తాజాగా విడుదలపై పోల్‌ సర్వే ఫలితాల ప్రకారం ఇరువురి మధ్య పోరు హోరా హోరీగా సాగుతుతున్నట్టు వెల్లడైంది. రోమ్నీతో పోల్చుకుంటే ఒబామా స్వల్ప ఆధిక్యంలోనే ఉన్నట్టు ఆయా సర్వేలు చెబుతున్నాయి.

ఒబామాకు ఎంతో కీలకమైన రాష్ట్రం కొలరాడోతో పాటు మరో రెండు రాష్ట్రాల్లో ప్రచారాన్ని ముగించారు. ఇక్కడ సీఎన్‌ఎన్‌, ఓఆర్‌సీ ఇంటర్నేషనల్ పోల్‌ సర్వే ప్రకారం 50శాతం ఓటర్లు ఒబామాకు మద్దతు పలుకుతుండగా, రోమ్నీకి 48శాతం అండగా నిలుస్తున్నట్టు స్పష్టమైంది.
మరోవైపు అమెరికాకు చెందిన ఒక రాజకీయ పరిశోధన సంస్థ వారాంతంలో జరిపిన ఓ సర్వేలో రోమ్నీకే మొగ్గు కనిపించింది. రోమ్నీకి 48శాతం, ఒబామాకు 47శాతం ప్రజలు మద్దతునిస్తున్నారని వెల్లడించింది. ఇక వాషింగ్టన్‌ పోస్ట్‌-ఏబీసీ న్యూస్‌ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా ప్రజలంతా ఒబామా వెంటే నడుస్తు న్నారని స్పష్టం చేసింది. ఒబామాకు 49శాతం, రోమ్నీకి 48శాతం ఓట్లు పడనున్నాయని తెలిపింది.


వివాదాలు సినిమాకు కాసులు కురిపిస్తున్నాయా?


టాలీవుడ్ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతోంది. మన మూవీ మేకర్లంతా ఇప్పుడు జపిస్తున్న మంత్రం వివాదం. కోట్లు పెట్టిన రాని పబ్లిసిటీ ఒక్క వివాదంతోనే వస్తాయని నిర్మాతలు నమ్ముతున్నారా? వివాదాలే సినిమాకు కాసులు కురిపిస్తాయా? ప్రస్తుతం టాలీవుడ్ జరుగుతున్న సీన్ ఏంటి?   ఇటీవల తెలుగు సినిమాలు వివాదాలతోనే బాగా పబ్లిసిటీ అవుతున్నాయి. విడుదలకు ముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న సినిమాలు కొన్ని అయితే.... విడుదల తర్వాత మరికొన్ని చిత్రాలు వివాదాలకు దారి తీసి నిషేధాల వరకూ వెళుతున్నాయి. మరికొన్ని చిత్రాలు కోర్టు గడపను తొక్కుతున్నాయి.

పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగాతో రాంబాబు సినిమా వివాదం కొద్ది రోజుల పాటు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ వాదులు ఈ సినిమాపై ఫైర్ అయ్యారు. ఉద్యమాన్ని కించపరిచేలా సీన్లు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు చిత్రయూనిట్ అభ్యంతరకరమైన సీన్లు తొలిగించింది. సీన్ రివర్స్.. అయితే మొదటి రోజు కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 'రాంబాబు' సినిమా.. ఈ వివాదంతో పబ్లిసిటీ ఏర్పడి మరింతా లాభపడుతుందని అందరు ఆశించారు..........





Friday, October 19, 2012

నిత్యానందకు మరో శిష్యురాలు


వివాదాస్పద స్వామి నిత్యానందపై ఎన్ని ఆరోపణలు వచ్చినా… ఆయనపై నటీమనులకు మాత్రం మోజు తగ్గడం లేదు. మొన్నటి వరకు నటి రంజిత ఒక్కతే ఉందనుకుంటే… ఇప్పడు ఆ జాబితాలో కౌసల్య కూడా చేరింపోయింది. కౌసల్య ‘కాలమెల్లాంకాదల్ వాల్గ’ అన్న తమిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ తరువాత ప్రియముడన్, ఉన్నుడన్, వానత్తైల, మనదై తిరిడి విట్టాయే మొదలగు చిత్రాల్లో నటించింది. తమిళంతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో నటించిన కౌసల్య చివరగా సంతోష సుబ్రమణియం చిత్రంలో నటించింది. మూడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న కౌసల్య ప్రస్తుతం బెంగళూరులో నివాసముంటోంది. 32 ఏళ్ల కౌసల్య తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతూ డాక్టర్ల వద్ద చికిత్స పొందినా నయం కాలేదు.

నిత్యానంద హీలింగ్ చికిత్స

నిత్యానంద స్వామి హీలింగ్ చికిత్సలో నిపుణుడు. దీంతో కౌసల్య నిత్యానంద ఆశ్రమం వెళ్లి హీలింగ్ చికిత్స పొందింది. ప్రస్తుతం వెన్నునొప్పి పూర్తిగా తగ్గిపోవడంతో కౌసల్య నిత్యానంద శిష్యురాలిగా మారింది. 





Thursday, October 18, 2012

కాంగ్రెస్‌కు దిమ్మదిరిగే స్ట్రోక్..!


అధికార కాంగ్రెస్ పార్టీకి దిమ్మదిరిగే స్ట్రోక్ ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. తెలంగాణపై కేంద్రం వైఖరిని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోంది. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధిష్టానాన్ని ఎప్పటినుంచో బెదిరిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ఇంద్రకరణ్ రెడ్డి అదే సాకుతో జగన్ పార్టీవైపు అడుగులేస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలతోపాటూ తెలంగాణ నాయకులను కూడా పార్టీలోకి ఆహ్వానించి పార్టీకి మరింత ఊపు తేవాలనుకుంటున్నారు.

షర్మిల మరో ప్రజా ప్రస్థానం యాత్ర ఇంకా ఊపందుకోకముందే వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వలసలు ఊపందుకున్నాయి. టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మాజీ నేతలతోపాటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా జగన్ పార్టీవైపు అడుగులేస్తున్నారు. తాజాగా  కాంగ్రెసు సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు ఇంద్రకరణ్ రెడ్డి వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణపై అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదనే.. సాకుతో ఇంద్రకరణ్ రెడ్డి జగన్ పార్టీలోకి దూకేందుకు సిద్ధమవుతున్నారు.







Tuesday, October 16, 2012

నాగార్జున సిక్స్‌ప్యాక్‌..!

వయసు పెరుగుతున్నకొద్ది నవ మన్మథుడిగా మారిపోతున్నాడు అక్కినేని నాగార్జున. అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ.. సిక్స్ ప్యాక్ బాడీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డమరుకం సినిమా కోసం తన బాడీని సిక్స్ ప్యాక్ గా మార్చుకున్నాడు నాగ్.

అయితే నాగార్జున 54 ఏళ్ల వయసులోనూ సిక్స్ ప్యాక్ తో కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 54 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలా కనిపించడమే కాకుండా సిక్స్ ప్యాక్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ టాలీవుడ్ నవ మన్మథుడు. 

నాగార్జున సిక్స్ ప్యాక్ బాడీ కోసం బాగానే కసరత్తులు చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ట్రైనర్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. మన్మధుడిగా తనకు తానే సాటి అని ప్రూవ్ చేసిన నాగ్...సిక్స్ ప్యాక్ బాడీతో యువ హీరోలతో పోటీ పడుతుండటం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. 




Monday, October 15, 2012

దర్శకుడా.. నిర్మాతా..? ముంచింది ఎవరు?

తెరపైనే కాదు తెరవెనుకా సీన్ రసవత్తరంగా సాగుతోంది. అయితే తెర వెనుక ఆడుతున్నది మాత్రం దర్శకులు, నిర్మాతలే. ఇప్పుడు రెండు పెద్ద సినిమాల దర్శకనిర్మాతల గొడవలు బజారుకొచ్చాయి.

డైరెక్టర్ పై నిర్మాతలు…
డైరెక్టర్ లారెన్స్ నిండా ముంచాడంటూ ‘రెబల్’ నిర్మాతలు ఫిర్యాదు చేశారు. 22 కోట్ల బడ్జెట్ అని చెప్పాడని, 45 కోట్లు ఖర్చు పెట్టించాడని నిర్మాతల వాదన. మరోవైపు నిర్మాతలపై లారెన్స్ ఫైర్ అవుతున్నాడు. తనకు డబ్బింగ్ రీమేక్ రైట్స్ ఇస్తామని మరొకరికి అమ్ముకున్నారని లారెన్స్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై లారెన్స్.. నిర్మాతలపై దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశాడు. అయితే పెద్ద హీరో అని భారీ భరోసాతో అంత బడ్జెట్ పెట్టడంలో నిర్మాతది అత్యాశ లేదా? నిజంగానే లారెన్స్ నిర్మాతలను ముంచాడా? ఒకవేళ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తే ఇటువంటి గొడవ రచ్చకెక్కేదేనా..? ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో ఇదే జరుగుతున్న చర్చ ఇదే.

నిర్మాతపై డైరెక్టర్..
పవన్ సినిమా కెమెరామెన్ గంగాతో రాంబాబు సినిమా విషయం కూడా రచ్చకెక్కింది. ఈ సినిమా నిర్మాత దానయ్య తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇవ్వలేదంటూ ఫిర్యాదు కూడా చేశాడు. అయితే తాజాగా దర్శకులు సంఘం నిర్మాత దానయ్యకు డెడ్ లైన్ విధించింది. సినిమా విడుదలకు ముందే పూరి రెమ్యూనరేషన్ సెటిల్ చెయ్యాలని ఆల్టిమేటం జారీ చేస్తూ…బుధవారం వరకు గడువు విధించారు. లేకుంటే నిర్మాత దానయ్యకు దర్శకుల సంఘం సహాయ నిరాకరణ చేస్తుందని హెచ్చరించారు. అయితే ఈ వ్యవహారంపై కూడా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కెమెరామెన్ గంగాతో రాంబాబు సినిమాను పూరీ అలా చుట్టిపారేశాడంటూ టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఇక్కడ దర్శకున్ని, తప్పు పట్టాలో లేక నిర్మాతను తప్పు పట్టాలో తేలాల్సి ఉంది.


రెబల్ సినిమా విషయంలో నిర్మాతలు దర్శకునిపై ఫైర్ అయితే, కెమెరామెన్ గంగాతో రాంబాబు విషయంలో దర్శకుడే నిర్మాతలపై కంప్లైంట్ ఇచ్చాడు. ఇలా దర్శకనిర్మాతలు గొడవ పడటం ఇప్పుడు టాలీవుడ్ చర్చనీయాంశంగా మారుతోంది. ఏమైనా గొడవలు రచ్చకెక్కకుండా పరిష్కరించుకుంటే పరిశ్రమకు చెడ్డ పేరు రాకుండా ఉంటుందని సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.

more news updates
                       drusyam.net 
 

Saturday, October 13, 2012

ఫైరవీలతోనే నంది అవార్డులు..?

    నంది అవార్డుల లొసుగు మరోసారి బయటపడింది. నంది అవార్డుల విషయంలో ఏటేటా అపవాదు మూటగట్టుకుంటున్న ప్రభుత్వం మరోసారి విమర్శల పాలవుతోంది. ఫైరవీలతోనే నంది అవార్డులు వస్తాయా అనే చర్చ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.

శ్రీరామరాజ్యం వంటి కళాత్మక చిత్రాన్ని ఆవిష్కరించిన దర్శకుడు బాపు. ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని తెరకెక్కించిన బాపుకు అవార్డు రాకపోవడంపై సర్వత్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఉత్తమ చిత్రంగా ప్రకటించినప్పటికీ బాపు దర్శకత్వ ప్రతిభకు అవార్డు ప్రకటించలేదన్న విమర్శ ఉంది.

నందమూరి తారక రామరావు వంటి గొప్ప నటులకే నంది అవార్డులు రాలేదని, రాజకీయాలు చేస్తేనే నందులు వస్తాయని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. నంది అవార్డు పొందాలంటే తెరవెనుక రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఉందని.. అలాంటి నీచ సంస్కృతి తనకు లేదని, అందుకే తనకు ఇంత వరకు నంది అవార్డు రాలేదని ఇటీవల మోహన్ బాబు తేల్చి చెప్పారు. గతంలో అనేక పర్యాయాలు నంది అవార్డుల మీద మెహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలమే రేపాయి. అయితే ఈ సారి మాత్రం మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న కు బెస్ట్ లేడీ విలన్ అవార్డు దక్కింది.

2011లో ప్రేక్షకుల ఆధరణ పొందిన సినిమాలను నంది అవార్డుల కమిటి విస్మరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతా దూకుడు, శ్రీరామరాజ్యం చిత్రాలకు నందులు వరిస్తాయని ఊహించిందే. అయితే ఈ సినిమాలకు అవార్డుల పంట పండటంపై భిన్నభిప్రాయాలు లేకున్నా, బరిలో ఉన్న ఇతర చిత్రాలకు సమ న్యాయం జరగలేదన్న విమర్శలు తెరపైకి వస్తున్నాయి.

ఇతర కేటగిరీల్లో కందిరీగ, ఓమైఫ్రెండ్, మిస్టర్ ఫర్ ఫెక్ట్ వంటి చిత్రాలకు కూడా నందులు వస్తాయని భావించారు. కానీ ఈ చిత్రాలు ఎందుకూ పనికిరానివిగా జ్యూరీ తేల్చేసింది. మరి కొన్ని చిన్న సినిమాలకు అసలు ఛాన్సే ఇవ్వలేదని చిన్న నిర్మాతలు వాపోతున్నారు. ఏదేమైనా ప్రతిభకు అందించాల్సిన అవార్డులు.. ఫైరవీలకు దాసోహం అవుతున్నాయన్న విమర్శలకు అవార్డుల కమిటీ ఏం సమాధానం చెబుతుందో చూడాలి.

అవార్డుల వివరాలను జ్యూరీ సభ్యులు ఎస్‌.గోపాల్‌రెడ్డి ప్రకటించారు. అవార్డులను జనవరిలో ప్రదానం చేస్తారు.

more news updates
                       drusyam.net 
 


ఉత్తమ నటుడు : మహేష్‌బాబు(దూకుడు).
ఉత్తమ నటి : నయనతార(శ్రీరామరాజ్యం).
ఉత్తమ దర్శకుడు శంకర్‌ (జైబోలో తెలంగాణ).
ఉత్తమ చిత్రం : శ్రీరామరాజ్యం.
ఉత్తమ ద్వితీయ చిత్రం : రాజన్న.
ఉత్తమ ద్వితీయ చిత్రం : విరోధి.
ఉత్తమ బాలల చిత్రం : శిఖరం.
రెండో బాలల ఉత్తమ చిత్రం : గంటల బండి.
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: అవయవదానం.
ఉత్తమ హాస్యనటి : రత్నసాగర్‌.
ఉత్తమ స్క్రీన్‌ప్లే : శ్రీనువైట్ల.
ఉత్తమ గీత రచయిత : సురేందర్‌.
ఉత్తమ మాట రచయిత : నీలకంఠ(విరోధి).
ఉత్తమ సంగీత దర్శకుడు : ఇలయరాజ.
ఉత్తమ వినోదభరిత చిత్రం : దూకుడు.
ఉత్తమ కుటుంబ కథా చిత్రం : 100 పర్సెంట్‌ లవ్‌
ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం : జైబోలో తెలంగాణ
ఉత్తమ సహాయనటుడు : ప్రకాశ్‌రాజు(దూకుడు).
ఉత్తమ సహాయ నటి : సుజాతారెడ్డి(ఇంకెన్నాళ్లు).
ఉత్తమ కథా చిత్రం : శ్రీనువైట్ల(దూకుడు).
ఉత్తమ గాయకుడు : గద్దర్‌ ( నడుస్తున్న పొద్దు మీద…)
ఉత్తమ కెమెరామేన్‌ పీఆర్కే రాజు (శ్రీరామరాజ్యం)
త్తమ క్వారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అక్కినేని (శ్రీరామరాజ్యం).
ఉత్తమ హాస్యనటుడు : ఎమ్మెస్‌ నారాయణ (దూకుడు).
ఉత్తమ విలన్‌ మంచు లక్ష్మీ ప్రసన్న (అనగనగా ఓ ధీరుడు).
స్పెషల్‌ జ్యూరీ అవార్డు : షాలిని.
ఉత్తమనేపథ్య గాయని : మాళవిక.
ఉత్తమ కొరియోగ్రాఫర్‌ : శ్రీను.
ఉత్తమ బాలనటుడు : మాస్టర్‌ నిఖిల్‌.
స్పెషల్‌ జ్యూరీ అవార్డు : నాగార్జున(రాజన్న).
స్పెషల్‌ జ్యూరీ అవార్డు : చార్మి
ఉత్తమ ఎడిటర్‌ : ఎమ్‌.ఆర్‌.వర్మ.

more news updates
                       drusyam.net 

Wednesday, October 10, 2012

అదీ.. అతిలోకసుందరి ఘనత..!


ఒకప్పుడు వెండితెరను ఏలిన అందాల రాణులు... ఇప్పుడు మళ్లీ తమ యాక్టింగ్ టాలెంట్ తో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. మ్యారేజ్ తర్వాత కెరీర్ కు గ్యాప్ ఇచ్చిన మాధురి దీక్షిత్... అజనాచ్లే (Aaja Nachle) సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. అయితే రీఎంట్రీ అదిరిపోతుందనుకున్న మాధురికి నిరాశే కలిగింది. సెకండ్ ఇన్నింగ్స్ లో  దేద్ ఇష్కియా, గులాబ్ గ్యాంగ్ వంటి సినిమాల్లో నటిస్తున్నా బాలీవుడ్ లో ఒకప్పుడు ఉన్న క్రేజీని మళ్లీ అందుకోలేకపోతోంది. మ్యారేజ్ లైఫ్ తర్వాత సినిమాలకు బై బై చెప్పిన కరిష్మా కపూర్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఈ ఏడాది ఆమె నటించిన డేంజరస్ ఇష్క్... తో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

కొద్ది రోజుల క్రితం పూరీ దర్శకత్వంలో అమితాబ్ నటించిన బుడ్డా హోగా తేరా బాప్ సినిమాలో నటించింది ఒకప్పటి బ్యూటీ రవీనా టాండన్. ఆ తర్వాత శోభనాస్ సెవెన్ నైట్స్ అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది. ఇక ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన జూహీచావ్లా మర్యాదరామన్న బాలీవుడ్ రీమేక్ సన్నాఫ్ సర్థార్ లో కీలక పాత్రలో కనిపించబోతోంది. వరుసగా సినిమాలకు రెడీ అవుతున్న జూహీచావ్లా సెకండ్ ఇన్నింగ్స్ కు పెద్దగా క్రేజీ రావడం లేదని చెప్పవచ్చు.


ఒకప్పుడు తమ అందచందాలతో ఆడియెన్స్ ను చూపుతిప్పుకోకుండా చేసిన ఈ తారలు... ఈ సారి పెర్ఫామెన్స్ తోనూ మెప్పించలేకపోతున్నారు. అయితే ఇదే టైమ్ లో వచ్చిన శ్రీదేవి మాత్రం ఊహించని అద్భుతం సాధించింది. వెటరన్ బ్యూటీలంతా ఇంతే.. అని అనుకుంటున్న వారందరిని తన సినిమాతో ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది.  అదిరిపోయే యాక్టింగ్ తో శ్రీదేవి చేసిన ఇంగ్లీష్-వింగ్లీష్ విడుదలైన అన్నిభాషల్లోనూ కేక పుట్టిస్తోంది.

పదిహేనేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న శ్రీదేవి ఎలా మెప్పిస్తుందో అన్న సందేహాలకు ఇంగ్లీష్-వింగ్లీష్ సినిమాతో సమాధానం చెప్పింది. తోటి వెటరన్ బ్యూటీలకు సాధ్యం కానీ పనిని సులువుగా సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్టింగ్ అదరిపోయింది. మరి మున్ముందు శ్రీదేవి ఎలాంటి పాత్రలతో వస్తుందోనని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

more news updates
                       drusyam.net 



Friday, July 27, 2012

షారుక్: నిను చూడక నేనుండలేను..!

సల్మాన్ ఖాన్ దగ్గర్నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఫరాఖాన్, అర్జున్ రాంపాల్ వరకు అందరితోనూ గిల్లికజ్జాలు పెట్టుకొన్న షారుక్ ఇప్పుడు మారిపోయాడు. ఇండస్ట్రీలో స్నేహితుల కన్నా శత్రువుల జాబితా పెరిగిపోతుండటంతో లాభం లేదనుకోన్నాడో ఏమో… మొత్తానికి భూమ్మీదకొచ్చి అందరితో కలిసిపోయి… కలుపుకుపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే శత్రుత్వాలు పక్కనబెట్టేసి మీడియా ముందు అందరినీ నా ఫ్రెండ్స్ అనేస్తున్నాడు. నిన్న మొన్నటి దాకా కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ తో.. ఆమె భర్త శిరీష్ కుందర్ తో తగువు పడ్డ షారుక్ ఇప్పుడు ఆమెతో కలిసి స్టెప్పులేస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత షారుక్ ఖాన్, ఫరాఖాన్ స్టేజీ మీద కలిసి చిందులేశారు.

బాలీవుడ్ బెస్ట్ బడ్డీస్ గా పాపులరైన షారుక్, ఫరా మొన్నామధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఎవరి దారి వారు చూసుకొన్నారు. సుమారు రెండేళ్ల పాటు ఇద్దరూ ముఖాలు చూసుకోకుండా మీడియా ముందు తిట్టుకొన్నారు. ఇండస్ట్రీ ఈవెంట్స్ లోనూ ఇద్దరూ ఎడ మొహం-పెడ మొహంగానే ఉన్నారు.

భారతీయుల సొత్తుగా ఆకాశ హర్మ్యం..!

బుర్జ్ ఖలీఫా… ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతిగా పేరు పొందిన ఆకాశ హర్మ్యం. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా భారతీయుల సొత్తుగా మారిపోతోంది. అంబరాన్ని చుంబిస్తున్నట్టు కనిపించే ఈ ఆకాశ హర్మ్యంలో మనవాళ్ల అడ్రస్ లే ఎక్కువగా కనబడుతున్నాయి. ఇందులో తొమ్మిది వందల వరకూ అపార్ట్ మెంట్లు ఉండగా అందులో వందకుపైగా భారతీయులవే కావడం విశేషం.

దుబాయికే మకుటంలా నిలిచిన ఈ భవంతి పొడవు 828 మీటర్లు కాగా… మొత్తం ఫ్లోర్ ఏరియా 50 లక్షల చదరపు అడుగులు. ఇందులో మొత్తం 163 ఫోర్లు ఉన్నాయి. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే లిఫ్ట్ లు ఈ భవంతిలో మొత్తం 54 ఉన్నాయి. రాత్రి వేళల్లో దేదీప్యమానంగా కనిపించే బుర్జ్ ఖలీఫా రోజుకు 50 మెగావాట్ల విద్యుత్ ను వినియోగించుకుంటుందంటే అవాక్కవ్వాల్సిందే. ఈ కరెంట్ తో మన దగ్గర చిన్నపాటి పరిశ్రామిక వాడలు నిరంతరాయంగా పనిచేయొచ్చు.




Tuesday, July 10, 2012

మహిళ ప్రధానిగా కరీనా..!


మహాభారతంలోని పాత్రలకు ఇప్పటి పరిస్థితులను జోడిస్తూ బాలీవుడ్ డైరెక్టర్ ప్రకాష్‌ఝా తెరకెక్కించిన ‘రాజ్‌నీతి’ చిత్రం 2010లో విడుదలై సంచలనం సృష్టించింది. కత్రినాకైఫ్, అజయ్‌దేవ్‌గన్, రణభీర్‌కపూర్ ప్రధాన పాత్రల్ని పోషించారు. అయితే తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘రాజ్‌నీతి 2’ చిత్రాన్ని తెరకెక్కించే సన్నాహాల్లో వున్నాడు ప్రకాష్‌ఝా.‘రాజ్‌నీతి 2’లో అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా కరీనాకపూర్ నటించబోతోంది. మహిళా ప్రధానిగా పవర్‌ఫుల్ పాత్రలో కరీనా నటించబోతోందని సమాచారం. రాజకీయ నాయకురాలి పాత్రలో నటించడం తనకు కొత్త అనుభవమని కరీనాకపూర్ తన పాత్రపట్ల స్పందించింది...

 

Monday, July 9, 2012

సన్నీలియోన్ పై మోజుపడ్డ బిన్ లాడెన్..!


అమెరికాను ఒక దశలో గడదడలాడించిన అల్ ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ పై మనసు పారేసుకున్నాడా… అవుననే అంటున్నాడు సంచలన రామ్ గోపాల్ వర్మ. అల్ ఖైదా అగ్రనేత బిన్ లాడెన్ కూడా సన్నీకి వీరాభిమాని అని… ఆమె ఒంపుసొంపులకు ఫిదా అయ్యాడని… సన్నీ లియోన్ అశ్లీల చిత్రాలకు లాడెన్ బానిసలా మారాడని…  సన్నీ వీడియోలు చూస్తున్నప్పుడే అమెరికా దళాలు కాల్చి చంపాయని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు వర్మ.

సినిమాలకు సమంత గుడ్ బై..!


వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమంత.. అభిమానులకు షాక్ లాంటి వార్త చెప్పింది. మరో మూడేళ్లలో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్టు తెలిపింది. ట్విట్టర్లో తన ఫాలోయర్స్ అడిగిన ప్రశ్నకు మరో మూడేళ్ళ దాక కెరీర్ కొనసాగించనున్నట్టు సమాధానం ఇచ్చింది. మంచి ఫ్యూచర్ ఉన్న ఈ క్యూట్ గర్ల్ సినిమాలకు గుడ్ బై చెబుతుందన్న విషయం ఫ్యాన్స్ జీర్జించుకోలేకపోతున్నారు.

Friday, June 29, 2012

కేంద్రం ఆలోచించేది ‘రాయల తెలంగాణ’?

ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం జరుపుతున్న చర్చలు రాష్ట్ర విభజనపైనేననే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. కేంద్రం రాయల తెలంగాణకే అనుకూలంగా ఉందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నాయి.  ఇప్పటికే రాయలసీమ నేతలు కూడా రాయల తెలంగాణకు సై అంటున్నట్టే ప్రచారం జరుగుతోంది.

రాయల తెలంగాణకు నోతాజాగా కేంద్ర హోంమంత్రి చిదంబరం కూడా తెలంగాణపై తేల్చేస్తామని ప్రకటించడంతో విభజన అంశం మళ్ళీ వేడెక్కుతోంది. అయితే రాయల తెలంగాణ అంశం తెరపైకి రావడంతో పలు పార్టీల తెలంగాణ నేతలు వ్యతిరేకిస్తున్నారు. రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని టీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. విలీనంనాటి తెలంగాణనే ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.







Friday, June 15, 2012

కొడాలి నాని చరిత్ర హీనుడు అవుతారా?

కృష్ణాజిల్లా టీడీపీలో ఇంకా ముసలం కొనసాగుతోంది. అందులో భాగంగానే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అలియాస్ వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. టీడీపీని వీడి  రేపోమాపో జైల్లో జగన్‌ కలిసేందుకు సిద్దమవుతున్నారు.  ఈ మేరకు నాని  నిర్ణయం తీసుకున్నట్లు  ఆయన అనుచరవర్గం చెబుతోంది. నాని టీడీపీ నుంచి వెళ్లడానికి అనేక కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

జూనియర్ తో గొడవలు
మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ తో నానికి మంచి సంబంధాలు ఉండేవి. అయితే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు నానిని జూనియర్ కు దూరం చేశాయని తెలుస్తోంది. కొంత కాలంగా నాని, జూనియర్ ఎన్టీఆర్ మధ్య రియల్ ఎస్టేట్ వివాదం నడుస్తోందని … అందువల్లే జూనియర్ ఎన్టీఆర్ తో నానికి పడడం లేదని ప్రచారం జరుగుతోంది. అంతేగాకుండా ఇటీవల నాని ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు జూనియర్ దంపతులు వస్తారని కార్డులు, పోస్టర్ల ద్వారా ప్రచారం చేశారని…  అయినా కూడా ఎన్టీఆర్ రాలేదని కోపంగా ఉన్నట్టు సమాచారం.


Saturday, June 9, 2012

ఆసక్తిపెంచుతున్న 150 కోట్ల ‘విశ్వరూపం’


యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఏది చేసినా సంచలనమే. తాజాగా కమల్‌హాసన్‌ స్వీయ నిర్మాణంలో తనే ప్రధానపాత్రలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం ‘విశ్వరూపం’. ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.  ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. వచ్చే నెల 23న వరల్డ్ వైడ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Latest Stories
drusyam.net

‘గబ్బర్‌ సింగ్’ టీమ్‌తో పవన్ అంత్యాక్షరి


సూపర్ హిట్ మూవీ ‘గబ్బర్ సింగ్’ సినిమా పేరెత్తగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది అంత్యాక్షరీ కామెడీ సీన్. సినిమాకే హైలెట్‌గా మారిన అంత్యాక్షరీ పార్ట్‌ను మరోసారి రిపీట్‌ చేసింది ఆ సినిమా టీమ్‌. ఆ సీన్లో నటించిన కమెడియన్స్‌తో కలిసి పవన్‌ తన నివాసంలో సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నాడు. అందరు కలిసి పండగ చేసుకున్నారు.

Latest Stories
drusyam.net

Thursday, June 7, 2012

ఎన్టీఆర్ మరో రీమేక్ సినిమాలో బాలకృష్ణ


ఓ వైపు కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో నటిస్తున్న టాలీవుడ్ అగ్రహీరో బాలకృష్ణ…. తన తండ్రి ఎన్టీఆర్ నటించిన సినిమాలను రీమేక్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. గతేడాది శ్రీరామరాజ్యం సినిమాతో ప్రేక్షకులను రంపింజేసిన బాలయ్య మరోసారి తన తండ్రి నటించిన జానపద చిత్రాల్లో నటించేందుకు సిద్దమవుతున్నాడు.
ఎన్టీఆర్ నటించిన నర్తనశాల సినిమా రీమేక్ చేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్న ఈ టాలీవుడ్ అగ్రహీరో… త్వరలోనే ఎన్టీఆర్ నటించిన ‘భట్టి విక్రమార్క’ సినిమా రీమేక్‌లో నటించే అవకాశం ఉందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్, ఎస్వీఆర్‌, కాంతారావు వంటి హేమాహేమీలు నటించిన భట్టి విక్రమార్క… యాభై రెండేళ్ల క్రితం విడుదలై అద్భుత విజయం సాధించింది.
ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటించిన ఈ సినిమాను బాలకృష్ణతో రీమేక్ చేసేందుకు నిర్మాత యలమంచలి సాయిబాబు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో లవకుశ సినిమాను శ్రీరామరాజ్యంగా రూపొందించిన సాయిబాబు మరోసారి బాలకృష్ణతో సినిమా చేసేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం.

More Stories
drusyam.net

Friday, June 1, 2012

వైఎస్‌ మృతి వెనుక జగన్‌?


ఉప ఎన్నికల  పోలింగ్‌ తేదీ దగ్గరపడేకొద్దీ రాజకీయ పార్టీల మధ్య విమర్శలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ప్రస్తుతం వైఎస్‌ మరణం హాట్‌ టాపిక్‌గా మారింది.  జగన్‌ జైలు కెళ్లిన తర్వాత ఆపార్టీ ప్రచార బాధ్యతలు చూస్తున్న విజయలక్ష్మి…వైఎస్‌ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విమర్శలు వైఎస్‌ మరణానికి జగన్‌కు లింకులు వెతికేదాకా వెళ్లాయి.  ఆ లింకులకు ఆధారాలు కూడా చూపిస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు.

జగన్‌-బ్రహ్మానందరెడ్డి లింకులేంటి?  
ఇప్పటికే జగన్‌ వైఖరిని ఎండగడుతున్న కాంగ్రెస్‌ నేతలు…విజయలక్ష్మి విమర్శలకు అంతేస్థాయిలో బదులిస్తున్నారు.  వైఎస్‌ మరణంపై తమకు కూడా అనుమానాలు ఉన్నాయని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. వైఎస్‌ మరణానికి, జగన్‌కు సంబంధం ఉందని అనుమానం వ్యక్తంచేశారు.  ఈ అనుమానాలకు ఆధారాలుగా అప్పటి ఏవియేషన్‌ అధికారి బ్రహ్మానందరెడ్డి, జగన్‌కు మధ్య ఉన్న ఆర్ధిక లావాదేవీలను ప్రస్తావించారు. వైఎస్‌కు హెలికాఫ్టర్‌ను సమకూర్చింది బ్రహ్మానందరెడ్డేనని బొత్స గుర్తుచేశారు.  అదే బ్రహ్మానందరెడ్డి… జగన్‌ అక్రమాస్తుల కేసులో ఇప్పుడు జైలులో ఉన్నారని…ఈ మొత్తం లింకులపై సమగ్ర విచారణ జరగాలని బొత్స అన్నారు.

నేరం రుజువైతే జగన్‌కు 14 ఏళ్ల జైలు
మరోవైపు సీఎం కూడా జగన్‌పై ఎదురుదాడి చేశారు. జగన్‌ చేసింది చిన్న నేరం కాదని,  దేశద్రోహానికి పాల్పడటంవల్లే సీబీఐ జగన్‌ను అరెస్ట్‌ చేసిందని సీఎం తెలిపారు. నేరం రుజువైతే జగన్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష ఖాయమన్నారు. జగన్‌ కేసుల్లోని సెక్షన్లను…ఆ సెక్షన్ల ప్రకారం ఉన్న నేర తీవ్రతను కిరణ్‌ వివరించారు.
రెండు పక్షాల వైఖరి ఇలాగే కొనసాగితే…పోలింగ్‌ తేదీ దగ్గరపడే  నాటికి వైఎస్‌ మరణంపై  మరిన్ని అనుమానాలు…తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

drusyam.net 









Thursday, May 24, 2012

‘అరెస్టయితే పార్టీని అమ్మే చూసుకుంటారు’


తాను అరెస్టు అయితే తమ పార్టీ బాధ్యతలను అమ్మే చూసుకుంటారని వైఎస్ జగన్ తెలిపారు. గుంటూరు జిల్లా ఎన్నికల ప్రచారంలో జగన్ ఈ విషయం ప్రకటించారు. వైఎస్ జగన్ అరెస్టయితే పులివెందుల శాసనసభ్యురాలు, వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మ పార్టీని నడిపించే బాధ్యతను తీసుకుంటారని జగన్ ప్రకటనను బట్టి స్పష్టమైంది.
తన అరెస్టుకు ఢిల్లీ నుంచి కుట్ర జరుగుతోందని జగన్ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల హంగామా చూస్తుంటే కుట్ర అర్థమవుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి తన మీద వేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ఉప ఎన్నికలను వాయిదా వేయించడమే వారి ఉద్దేశ్యమని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఒక్క చోట కూడా విజయం సాధించలేవని ఆయన అన్నారు.

drusyam.net

Wednesday, May 23, 2012

యాడ్ ప్రపంచంలో ఖరీదైన కరీనా..!



కపూర్‌ ఫ్యామిలీలో నాలుగో తరానికి చెందిన కరీనాకపూర్‌ బాలీవుడ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్. బాలీవుడ్‌లో ఇప్పుడు కరీనాకపూర్ హవా జోరుగా వీస్తోంది. ఒక స్టార్ హీరోయిన్ కి ఉండవలసిన కమెర్షియల్ అవేలబ్యులిటీ కరీనాకపూర్‌లో పుష్కలంగా ఉన్నాయి. సినిమాలతోనే కాదు యాడ్‌ ప్రపంచంలోనూ తన సత్తా చూపిస్తూనే వుంది. ప్రస్తుతం కరీనా చేతిలో 15కు పైగా బ్రాండ్లు వున్నాయి. వీటిల్లో ఏడు కంపెనీల యాడ్స్ నిత్యం టెలివిజన్‌లో కనిపిస్తూనే వుంటాయి. కరీనాకు ప్రధాన పోటీదారుగా వున్న కత్రినా కైఫ్‌ చేతుల్లో ఐదు, ప్రియాంకాచోప్రా, అనుష్క శర్మ దగ్గర చెరో మూడు, దీపిక పడుకొనే వద్ద రెండు బ్రాండ్లు ఉన్నాయి. టివిలో కనిపించే సమయం, సీజన్‌ల పరంగా పోల్చినా కూడా కరీనా లేడీ బ్రాండ్లలో ఫస్ట్‌ ప్లెస్‌లో వుంది. కార్పొరేట్ల నుంచి మిగిలిన వారందరి కన్నా ఎక్కువగానే కరీనా వసూలు చేస్తోంది.

రచ్చ @ 50 రోజులు


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రచ్చ’ సినిమా నేటితో సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 127 సెంటర్లలో ఈ చిత్రం ఫిప్టీ డేస్ కంప్లీట్ చేసుకుని దూసుకుపోతోంది. రామ్ చరణ్-తమన్నా జంటగా సంపత్ నంది తెరకెక్కించిన ఈ సినిమా ఇచ్చిన రిజల్ట్ మెగా ఫ్యాన్స్ లో ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది.

Tuesday, May 15, 2012

అందమైన భామలు - అదిరిపోయే రేట్లు


హాట్ హాట్ అందాలతో రెచ్చిపోతూ రెమ్యూనరేషన్ విషయంలోనూ తమకు హద్దేలే లేవంటున్నారు టాలీవుడ్ హీరోయిన్లు.  రెమ్యూనరేషన్ విషయంలో హీరోలతో పోటి పడుతున్నారు. వరుస సినిమాలతో జోరుమీదున్న  హీరోయిన్స్ రెమ్యునేషన్స్ వింటే పెద్ద నిర్మాతలు సైతం ఖంగుతింటున్నారు. షాక్ గురిచేసేలా వారి పారితోషికం పెంచుతూనే వున్నారు.

drusyam.net

కళ్ళు చెదిరే అందం మాధురి దీక్షిత్ !

అది బాలీవుడ్ స్ర్కీన్... పాతికేళ్ళ పాటు  కళ్ళు చెదిరే చిందులు.. అందంతో ఆకట్టుకునే అద్భుతరూపం.. నటనతో మెప్పించింది.. నాట్యంతో  అలరించింది ఒకప్పటి నంబర్ వన్ హీరోయిన్  మాధురి దీక్షిత్‌.  ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆరాధ్యదేవత అయిన మాధురిదీక్షిత్ ఈ రోజు బర్త్ డే జరుపుకుంటోంది.


Read Full Story
drusyam.net

జూనియర్ పయనం ఎటు?

జూనియర్ ఎన్టీఆర్ వ్యూహాత్మకంగానే వెనక్కి తగ్గాడా? ఫ్యాన్స్ వ్యతిరేకత వల్లే తాజా కామెంట్లు చేశాడా? తాజా సీన్ చూస్తుంటే అలాగే కనిపిస్తోందంటున్నారు.  అయినా తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని ప్రకటించారే తప్ప, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కలిసి పని చేస్తానని ప్రకటించలేదు…ఆయనపై విధేయత ప్రకటించలేదు. చంద్రబాబుతో ఎన్టీఆర్ విభేదాలు కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. దమ్ము సినిమాపై జరిగిన మీడియా మీట్‌లో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. వంశీతో జగన్ భేటీ తన సూచన మేరకే జరిగిందనే వార్తలను ఆయన ఖండించారు. తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

drusyam.net

Sunday, May 13, 2012

రవితేజ రీమేక్ సినిమాలే ‘కిక్’



మాస్ రాజా రవితేజ సినిమాలపై ఇతర భాషల మూవీ మేకర్స్ మోజు పడుతున్నారు. దాంతో రవితేజ సినిమాలు వరుసగా రీమేక్ అవుతున్నాయి. రవితేజ హిట్ మూవీ విక్రమార్కుడు చిత్రం హిందీలో రౌడీరాథోర్ టైటిల్ తో రీమేక్ అవుతోంది. ప్రభుదేవా దర్శకత్వంలో అక్షయ్  కుమార్ హీరోగా చేస్తున్నాడు. విడుదలకు ముందే బాలీవుడ్ ఈ మూవీ భారీ అంచనాలు తీసుకువస్తోంది.
ఇక రవితేజ నటించిన మరో సినిమా కిక్ పై కూడా ఇతర భాషల వారి కన్నుపడింది. రవితేజ, ఇలియానా కాంబినేషన్ లో సురేంద్ర రెడ్డి రూపొందించిన కిక్ తెలుగులో సూపర్ హిట్టయింది. ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్ అదిరిపోయింది. ఈ సినిమా ఇప్పుడు కన్నడంలో రీమేక్ అవుతోంది. కన్నడ రీమేక్ లో ఇంద్రజిత్ లోకేష్ దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా నటించటానికి రెడీ అవుతున్నాడు. గతంలో ఉపేంద్ర-ఇంద్రజిత్ కాంబినేషన్లో ఐశ్వర్య అనే సినిమా వచ్చింది. ఇది తెలుగులో నాగార్జున నటించిన మన్మథుడు రీమేక్ గా రూపొందించారు. ఈ సినిమా కూడా అక్కడ మంచి విజయం సాధించింది. అలాగే గతంలో రవితేజ చేసిన కృష్ణ సినిమా రీమేక్ లో కూడా హీరోగా ఉపేంద్ర చేశాడు. అదే సినిమాను తెలుగులో రజినీ ఫ్రం రాజమండ్రి పేరుతో తెలుగులోకి డబ్ చేశారు.
ఇక ప్రస్తుతం ఉపేంద్ర మంచి జోష్ మీదున్నాడు. ఉపేంద్ర లేటెస్ట్ మూవీ కఠారి వీర..సుర సుందరాంగి హిట్ టాక్ సొంతం చేసుకుంది. కన్నడ మొదటి త్రీడీ గా రూపొందిన ఈ చిత్రం రొమాంటిక్ ఫాంటసీ గా చెప్తున్నారు. మంచి జోష్ మీదున్న ఉపేంద్ర మరోసారి రవితేజ కిక్ సినిమాతో మరో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.

drusyam.net 

Wednesday, February 8, 2012

జగన్ ను చెక్కిన శిల్పులెవరు ?


2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సుపరిచితులు. ఆయన తనయుడు జగన్ అనే విషయం రాజకీయ వర్గాల్లో చాలా మందికి తెలుసు. కాని అతడిలో దమ్మెంతుంది..

రీడ్ మోర్...

http://drusyam.net/