Friday, October 19, 2012

నిత్యానందకు మరో శిష్యురాలు


వివాదాస్పద స్వామి నిత్యానందపై ఎన్ని ఆరోపణలు వచ్చినా… ఆయనపై నటీమనులకు మాత్రం మోజు తగ్గడం లేదు. మొన్నటి వరకు నటి రంజిత ఒక్కతే ఉందనుకుంటే… ఇప్పడు ఆ జాబితాలో కౌసల్య కూడా చేరింపోయింది. కౌసల్య ‘కాలమెల్లాంకాదల్ వాల్గ’ అన్న తమిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ తరువాత ప్రియముడన్, ఉన్నుడన్, వానత్తైల, మనదై తిరిడి విట్టాయే మొదలగు చిత్రాల్లో నటించింది. తమిళంతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో నటించిన కౌసల్య చివరగా సంతోష సుబ్రమణియం చిత్రంలో నటించింది. మూడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న కౌసల్య ప్రస్తుతం బెంగళూరులో నివాసముంటోంది. 32 ఏళ్ల కౌసల్య తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతూ డాక్టర్ల వద్ద చికిత్స పొందినా నయం కాలేదు.

నిత్యానంద హీలింగ్ చికిత్స

నిత్యానంద స్వామి హీలింగ్ చికిత్సలో నిపుణుడు. దీంతో కౌసల్య నిత్యానంద ఆశ్రమం వెళ్లి హీలింగ్ చికిత్స పొందింది. ప్రస్తుతం వెన్నునొప్పి పూర్తిగా తగ్గిపోవడంతో కౌసల్య నిత్యానంద శిష్యురాలిగా మారింది. 





No comments:

Post a Comment