Thursday, October 18, 2012

కాంగ్రెస్‌కు దిమ్మదిరిగే స్ట్రోక్..!


అధికార కాంగ్రెస్ పార్టీకి దిమ్మదిరిగే స్ట్రోక్ ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. తెలంగాణపై కేంద్రం వైఖరిని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోంది. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధిష్టానాన్ని ఎప్పటినుంచో బెదిరిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ఇంద్రకరణ్ రెడ్డి అదే సాకుతో జగన్ పార్టీవైపు అడుగులేస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలతోపాటూ తెలంగాణ నాయకులను కూడా పార్టీలోకి ఆహ్వానించి పార్టీకి మరింత ఊపు తేవాలనుకుంటున్నారు.

షర్మిల మరో ప్రజా ప్రస్థానం యాత్ర ఇంకా ఊపందుకోకముందే వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వలసలు ఊపందుకున్నాయి. టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మాజీ నేతలతోపాటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా జగన్ పార్టీవైపు అడుగులేస్తున్నారు. తాజాగా  కాంగ్రెసు సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు ఇంద్రకరణ్ రెడ్డి వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణపై అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదనే.. సాకుతో ఇంద్రకరణ్ రెడ్డి జగన్ పార్టీలోకి దూకేందుకు సిద్ధమవుతున్నారు.







No comments:

Post a Comment