తాను అరెస్టు అయితే తమ పార్టీ బాధ్యతలను అమ్మే చూసుకుంటారని వైఎస్ జగన్ తెలిపారు. గుంటూరు జిల్లా ఎన్నికల ప్రచారంలో జగన్ ఈ విషయం ప్రకటించారు. వైఎస్ జగన్ అరెస్టయితే పులివెందుల శాసనసభ్యురాలు, వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మ పార్టీని నడిపించే బాధ్యతను తీసుకుంటారని జగన్ ప్రకటనను బట్టి స్పష్టమైంది.
తన అరెస్టుకు ఢిల్లీ నుంచి కుట్ర జరుగుతోందని జగన్ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల హంగామా చూస్తుంటే కుట్ర అర్థమవుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి తన మీద వేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ఉప ఎన్నికలను వాయిదా వేయించడమే వారి ఉద్దేశ్యమని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఒక్క చోట కూడా విజయం సాధించలేవని ఆయన అన్నారు.
drusyam.net
No comments:
Post a Comment