సినిమా పాట చంద్రోదయాలు... చల్లని సాయంత్రాలు.. వెన్నెల కాంతులు... వసంత రాత్రులు... అన్నీ చూసింది. ఇక ఇప్పుడు రీమిక్స్. పాట పల్లవిని అలాగే వుంచి.. చరణాలను కొత్తగా మార్చి సరికొత్తగా కంపోజ్ చేయడం రివాజైంది. పాట మొత్తాన్ని యథాతథంగా దింపేసిన సందర్భాలూ వుంటున్నాయి. ఈ ట్రెండ్ను ఇటీవలి కాలంలో బాగా ఫాలోఅవుతున్న హీరో పవన్కళ్యాణ్. ఇటీవలే ఆడియో ఫంక్షన్ జరుపుకుని రిలీజ్కు రెడీ అవుతున్న పవర్స్టార్ పవన్కళ్యాణ్ మూవీ తీన్మార్లోనూ రీమిక్స్ సాంగ్ ఉంది. ఓహోబస్తీ దొరసాని అలనాటి హిట్ సాంగ్ను మళ్ళీ గుర్తుకుతెచ్చింది.
1960లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన అభిమానం చిత్రంలోనిది ఈ పాట. ఘంటసాల-జిక్కి పాడిన ఈ పాటను ఆరుద్ర రాశారు.
పవన్కళ్యాణ్ మరో సినిమా ఖుషీలోనూ ఓ సాంగ్ను రీమిక్స్ చేశారు. పవన్కళ్యాణ్-భూమికపై చిత్రించిన ఆడువారి మాటలకు అర్థాలే అంటూ సాగే ఈ సాంగ్ జనాన్ని అలరించింది.
1955లో వచ్చిన ఎవర్గ్రీన్ సినిమా 'మిస్సమ్మ'లోనిది ఈ పాట. ఎన్టీయార్, సావిత్రి అభినయించిన ఈ పాత పాటను నెమరేసుకోని సంగీతాభిమానులుండరు. సాలూరి రాజేశ్వరరావు గొప్పతనమది.
పవన్కళ్యాణ్ రీమిక్స్ చేసిన మరో పాట తానే డైరెక్ట్ చేసిన జానీలోనిది. ఈ రేయితీయనిది అంటూ సాగుతుందీ పాట. ఈ పాట చిట్టిచెల్లెలు సినిమాలోని ఈ రేయి తీయనిది పాటను వాడుకున్నాడు.
భీమవరంబుల్లోడా పాలు కావాలా.. అంటూ ఇటీవలే వచ్చిన మూవీ రాజ్. సుమంత్, ప్రియమణి, విమలారామన్ కలిసి ఆడిపాడిన ఈ పాట మరోసారి ఆడియన్స్ను అలరించింది.
ఈ సాంగ్ ఘరానాబుల్లోడు నుంచి రీమీక్స్ చేసిన పాట. నాగార్జున-ఆమని స్టెప్పులేసిన ఈ పాట అప్పట్లో యూత్ను తెగ అట్రాక్ట్ చేసింది.
అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ ఆహా నా పెళ్ళంటలోనూ వచ్చిన రీమిక్స్ పాట అందరిని అలరిస్తోంది. ఈ సినిమాకి ఈ పాట హైలెట్గా నిలిచింది.
ఈ పాట 1982లో వచ్చిన జంధ్యాల సినిమానాలుగు స్తంబాలాటలోనిది. వేటూరి రాసిన ఈ పాటకు రాజన్-నాగేంద్ర మ్యూజిక్ అందించారు.
ఇలా అలనాటి హిట్ పాటలను రీమిక్స్ చేయడంతో సినిమాకు కూడా ప్లస్ పాయింట్ అవుతోంది. అందుకే కొత్త సినిమాలు ఆ సూత్రాన్ని పాటిస్తూనే వున్నాయి. ఏమైనా అలనాటి మధుర గీతాలను మళ్ళీ మనం ఆస్వాదిస్తూనే ఉన్నాము.
No comments:
Post a Comment