Sunday, June 2, 2013

నెక్ట్స్ బర్తరఫ్ బుల్లెట్ ఎవరిపై..?

డీఎల్ రవీంద్రారెడ్డి తో పాటు మరో ఇద్దరు మంత్రులపై కూడా సీఎం వేటు వేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్న నేఫథ్యంలో అసమ్మతి మంత్రులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఏ నిముషంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నారు.

ముఖ్యమంత్రి వ్యతిరేకిగా, అసమ్మతి మంత్రిగా ముద్రపడ్డ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిపై వేటు పడిన నేపథ్యంలో మంత్రి వర్గంలో అలజడి మొదలైంది. కిరణ్ కేబినేట్ లో నుంచి మరో ఇద్దరికి కూడా ఉద్వాసన తప్పదని ఊహాగానాలు వెలువడుతుండటంతో మంత్రుల హార్ట్ బీట్ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఇన్నాళ్లు సీఎంని వ్యతిరేకిస్తూ వస్తున్నవాళ్లు, వివిధ కేసుల్లో ఇరుక్కున్న మంత్రులకు ఈ టెన్షన్ ఇంకాస్త ఎక్కువగా ఉంది. అయితే ఆ ఇద్దరు మంత్రులు ఎవరు అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Full Story &..
More Latest Updates... www.drusyam.net   

  
 More Latest Updates... www.drusyam.net  

No comments:

Post a Comment