Monday, June 24, 2013

మెగా పవర్ స్టార్ ‘డబుల్’ మజా..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒకేసమయంలో ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లలో నటించడానికి ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు బాలీవుడ్ అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటున్నాడు. బాలీవుడ్ మూవీ మేకర్లకు అందుబాటులో ఉండేందుకు ముంబైలోనే ఓ ప్లాట్ ని కూడా కొనుకున్నాడట రామ్ చరణ్. తన అప్ కమింగ్ మూవీ జంజీర్ విడుద‌ల త‌ర‌వాత  త‌న‌కు అక్కడ మ‌రిన్ని అవ‌కాశాలొస్తాయని చ‌ర‌ణ్ న‌మ్మకంగా చెబుతున్నాడు.

జంజీర్ రామ్‌చ‌ర‌ణ్ కు బాలీవుడ్ లో ఫస్ట్ మూవీ.‌ అయితే.. ఈ సినిమా విడుద‌ల కాక‌ముందే.. బాలీవుడ్‌లో చెర్రీకి మ‌రో ఆఫర్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.  జంజీర్ టీజర్ లో చ‌ర‌ణ్‌.. లుక్‌, స్టైల్ చూసిన బాలీవుడ్ మూవీ మేకర్లు చెర్రీతో సినిమా చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారట.  త్వరలోనే చెర్రీ ఫ‌ర్హాన్ అక్తర్ ద‌ర్శకత్వంలో న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని బాలీవుడ్ టాక్‌.

ఇక రామ్ చ‌ర‌ణ్ నటించిన రెండు సినిమాలు వ‌రుస‌గా రిలీజ్‌కు సిద్దంగా ఉండ‌టంతో మెగా అభిమానులు ఖుషీగా ఉన్నారు. అభిమానుల ఖుషీ వెనుక రామ్ చ‌ర‌ణ్ హార్డ్ వ‌ర్కింగ్ ఎంతో ఉంది. జంజీర్ షూటింగ్ చేస్తూనే, ఎవ‌డు మూవీలోనూ పార్టిసిపేట్ చేశాడు. జంజీర్ షూటింగ్ కంప్లీట్ అవ‌డంతో, త‌రువాత ఎవ‌డు మూవీతో పాటు మ‌రో ప్రాజెక్ట్‌కు రెడీ అయ్యాడు. ఈ విధంగా ఏక కాలంలో రెండు మూవీల‌ను ట్రాక్‌లో పెట్టుకుంటున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌..
More Latest Updates.. www.drusyam.net 

No comments:

Post a Comment