కొత్త బంగారు లోకం
Wednesday, June 5, 2013
ఫ్యూచర్ కెరీర్ తేల్చిచెప్పిన పండుగాడు!
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇప్పట్లో లేదని ప్రిన్స్ మహేష్ బాబు చెప్పారు. రాజకీయాల గురించి తానెప్పుడూ ఆలోచన చేయలేదని, అంత తీరిక కూడా లేదని తెలిపాడు. ఇక టాలీవుడ్ను వదిలి వెళ్లే ఉద్దేశం తనకు ఏ మాత్రం లేదని ప్రిన్స్ స్పష్టం చేశాడు. విజయవాడ ఏలూరు రోడ్డులో కొత్తగా ఏర్పాటైన రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్ ను మహేష్ బాబు ప్రారంభించాడు. అనంతరం మహేష్ మీడియాతో మాట్లాడారు. చిన్న పిల్లల ఆరోగ్యం కోసం తమ వంతు సహాయం అందిస్తానని తెలిపాడు.
తాజాగా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘1 నేనొక్కడినే’ చిత్రం టీజర్ రికార్డు బ్రేక్ చేయటం సంతోషంగా ఉందని మహేష్ చెప్పుకొచ్చాడు. తన నట జీవితంలో 1 నేనొక్కడినే’ చిత్రం మైలు రాయిగా నిలుస్తుందని, అందులో కొత్త లుక్ తో కనిపిస్తానని తెలిపాడు. బాలీవుడ్లో సినిమా చేస్తున్నట్టు వచ్చిన వార్తలకు స్పందిస్తూ, వేరే ఇండస్ట్రీలోకి వెళ్లే ఆలోచన లేదని గతంలోనే చెప్పాను, ఇప్పుడూ అదే చెబుతున్నాను. మరో పదేళ్ల పాటు టాలీవుడ్ లోనే ఉంటానని ప్రిన్స్ స్పష్టం చేశాడు. స్టోరీ దొరికితే మల్టీ స్టారర్ సినిమాలకు కూడా సిద్దంగా ఉన్నట్టు మహేష్ తెలిపాడు.
More Latest Updates...
www.drusyam.net
ఇదీ ట్రైలరే.. అసలు సినిమా అదిరిపోతుందట!
ఫ్యూచర్ కెరీర్ తేల్చిచెప్పిన పండుగాడు!
జియాఖాన్ పోస్టుమార్టం రిపోర్టులో తేలిన నిజం
వావ్..! ఇద్దరమ్మాయిలతో రానా!!
ఇద్దరమ్మాయిలతో.. వివాదం
‘స్పాట్ ఫిక్సింగ్’లో దావూద్, షకీల్..!
డీఎల్ ‘నోటి’కి తాళం..!
బాలీవుడ్ నటి జియాఖాన్ మృతి వెనుక..
ఈ కాపురం ఎన్నాళ్లు..?
More Latest Updates...
www.drusyam.net
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment